నవతెలంగాణ – ధరూర్
కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా కేంద్రంలో జరిగిన వివాహం వేడుకల్లో.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం రాయచూరు జిల్లా కేంద్రంలో శివుని నూతన దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందారు. అలాగే రాయచూర్ లోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన మల్దకల్ బాబు కుమారుడి వివాహ వేడుకల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొం గళ్ల రంజిత్ కుమార్పాల్గొని నూతన వధూ వరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్ర మాల్లో జెడ్పీ టీసీ రాజశేఖర్, కే.టీ దొడ్డి మండల అధ్యక్షుడు ఉరుకుందు, రాయచూరు కౌన్సిలర్ తిమ్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హనుమంతు, చంద్రశేఖర్, అమరేష్, గోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు , కన్వీనర్ బుచ్చిబాబు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు విజరు, రంగస్వామి గోపాల్, అంజి, బీమన్ గౌడ్, జ్ఞానేశ్వర్ , వన్నప్ప, రామాం జనేయులు, ఆంజనేయులు, వీరేష్ పాల్గొన్నారు.