సి కె మూర్తిని కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి సునీత ముదిరాజ్

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు సి కే మూర్తి ని శుక్రవారం ఇసామియా బజార్ లోని ఆయన నివాసంలో గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గం లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లకు మహిళా అధ్యక్షులను నియమించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు ఉషశ్రీ, ఏ బ్లాక్ అధ్యక్షరాలు రోజీ, జంబాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love