తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తొలి ఏకాదశి సందర్భంగా నాందేవ్ వాడలో గల విఠలేశ్వర ఆలయంలో వినాయక్ నగర్ లోని దత్త ఆశ్రమంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.నగర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతున్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్,కార్పొరేటర్ లు ధర్మపురి, ఉమారని తడ్కల్ శ్రీనివాస్, మాదని శ్రీదర్, కొవూరి జగన్, బొబ్బిలి మురళి, ఆర్ ఎల్ నర్సింహ,కసుభ సంపత్ బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love