అచ్చంపేట ప్రజాభవన్ లోకి ఎమ్మెల్యే దంపతుల నూతన ప్రవేశం..

నవతెలంగాణ- అచ్చంపేట:  అధికారిక ప్రజా భవన్ లోకి స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, సతీమణి డా.అనురాధ జెడ్పీటీసీ  శుక్రవారం నూతన ప్రవేశం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బదులుగా ప్రజాభవన్ గా నామకరణం చేశారు.  ప్రత్యేక హోమం, పూజలు వేద పండితులు మంత్రోత్సవంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదంతో అచ్చంపేట నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందాలని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ ప్రజాభవన్ నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలని వేద పండితులు దీవెనలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎమ్మెల్యే దంపతులకు లకు శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love