– డొంకేశ్వర్ మండలం అన్నారంలో..
– ఎలాంటి అభివృద్ధి చేయలేదని గ్రామస్తుల ఆవేదన
నవతెలంగాణ-డొంకేశ్వర్
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామస్తులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రచార రథాన్ని ఆదివారం అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ఎమ్మెల్యే జీవన్రెడ్డి దత్తత తీసుకుంటానని హామీనిచ్చి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఐదేండ్లలో ఎమ్మెల్యే ఒక్కసారి కూడా తమ గ్రామానికి రాలేదని వాపోయారు. తమ సమస్యలను ఒక్కసారి కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో అడ్డుకున్నట్టు తెలిపారు.