కంఠమహేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పైళ్ల

నవతెలంగాణ- వలిగొండ: మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో సోమవారం శ్రీ కంఠమహేశ్వర స్వామి బోనాల సందర్బంగా ముఖ్య అతిథిగా భువనగిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పైళ్ళ శేఖర్ రెడ్డి హాజరై  స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి గుట్ట  దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ ముద్దసాని కిరణ్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, గ్రామశాఖ అధ్యక్షులు బీమానబోయిన బిక్షపతి, మాజీ ఎంపీటీసీ శ్రీలత రమేష్, పబ్బు నర్సింహా, గుండెపూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love