వన్నెలు లిఫ్టు ఇరిగేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యేలు

నవతెలంగాణ – ఆర్మూర్ 

నియోజకవర్గంలోని వన్నెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి  అధ్వర్యంలో ముదొల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముధోల్ రైతులతో కలిసి ఆదివారం సందర్శించారు. ముదోల్ నియోజకవర్గంలో నూతనంగా అతి త్వరలో ఎత్తిపోతల లిఫ్ట్ లు నిర్మాణం కాబోతున్నాయి. వాటినీ ఎలా వినియోగించుకోవాలి అని,  పనితీరు రైతుల పాత్ర తెలుసుకోవడానికి విచ్చేశారు. వన్నేల్ రైతులు విచ్చేసిన రైతులకు వివరించారు. నీళ్ళు ఎలా వాడాలి  పంటల కోసం ఏ సందర్భంలో వినియోగించుకోవాలి ఆయకట్టు రైతులు అందరూ ఎలా ఉంటే లబ్ధి చేకూరుతుంది. చిన్న పాటి మరమ్మత్తులకు డబ్బులు ఎలా ఇవ్వాలి. సభ్యత్వం ఎలా తీసుకోవాలి అని స్థానిక రైతులు ముదోల్ రైతులకు వివరించారు. అనంతరం గోదావరి ఒడ్డున గల శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ  అసెంబ్లి కన్వీనర్ పలేపు రాజు, ఆబి గంగారాం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love