వ్యూహాత్మక కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే

– ఐపీఎల్‌ ప్రాంఛైజీ ఎల్‌ఎస్‌జీ నియామకం
ముంబయి: భారత మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో సరికొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు వ్యూహాత్మక కన్సల్టెంట్‌గా నియమితులయ్యాడు. జస్టిన్‌ లాంగర్‌ను చీఫ్‌ కోచ్‌గా ప్రకటించిన ఎల్‌ఎస్‌జి యాజమాన్యం.. తాజాగా ఎమ్మెస్కేను సైతం వ్యూహ బృందంలోని తీసుకుంది. ఆంధ్ర క్రికెట్‌కు గతంలో డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా పని చేసిన ఎమ్మెస్కే ప్రసాద్‌.. లక్నో సూపర్‌జెయింట్స్‌ టైటిల్‌ సాధించేందుకు అవసరమైన ప్రతిభాన్వేషణ, నైపుణ్యాభివృద్ది, అకాడమీ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని ఎల్‌ఎస్‌జి ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love