ప్రతిభకు ప్రోత్సాహంలో.. మోహన్ రెడ్డి ముందడుగు

నవతెలంగాణ-నవీపేట్: ప్రతిభకు పేదరికం అడ్డు అనే శీర్షికన నవ తెలంగాణ పత్రికలో సోమవారం కథనం ప్రచురితం కావడంతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి తనవంతుగా సహకరించేందుకు ముందడుగు వేశారు. జాతీయస్థాయి నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించి ఎంబీబీఎస్ సీటు పొందిన సిద్ధార్థ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో చదువుకునేందుకు వెనుకడుగు వేస్తుండడంతో సరస్వతీ పుత్రుడు సిద్ధార్థ్ ను ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందడుగు వేసి వడ్డీ మోహన్ రెడ్డి మంగళవారం ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చారు. దళిత బిడ్డ సిద్ధార్థ్ ను రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎంపీటీసీ రాధా, ఆనంద్, రామకృష్ణ, పుట్ట శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, నాగభూషణం, బండారి శేఖర్, అంకిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love