సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి..

నవతెలంగాణ – మునుగోడు
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ స్ఫూర్తిని పొంది హక్కుల సాధన కోసం నేటి సమాజం ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో  కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆనాడు చట్టసభల్లో ప్రజల తరఫున తన వాణిని వినిపించారని అన్నారు. భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర సుందరయ్యది అని, తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర సుందరయ్యదని ఆయన కొనియాడారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మళ్లీ ఉద్యమ నిర్మాణాన్నిపటిష్టం చేసేందుకు, విస్తృత పరిచేందుకు అంకితమైనరని ఆయన అన్నారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్న వయసులోనే సంఘసంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారని  అన్నారు. సీపీఐ(ఎం) ఏర్పడినప్పుడుతొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారని,ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారనిఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంకొనసాగిస్తూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గణనీయమైనదని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. భారతదేశం లో దోపిడి, అసమానతలు లేని సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని  ఆయన అన్నారు. మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను వేముల లింగస్వామి , యాట యాదయ్య , జీడిమడ్ల నరేష్ , యాట రాజు , ఎండి సిద్ధిక్ , యాస రాణి శివ , యాట శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Spread the love