మహిళా సంఘాలకు ఆర్థిక వనరులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీడీఓ

నవతెలంగాణ – గాంధారి
మహిళా సంఘాలకు ఆర్థిక వనరులు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఎంచుకుందని మండల అభివృద్ధి అధికారి శ్రీ రాజేశ్వర్ అన్నారు  శనివారం స్థానిక జువ్వాడి గ్రామ సంఘం భవనం లో మహిళా శక్తి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వము ఇటీవల మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందని ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలల ఏకరూప దుస్తులను తయారు చేయడానికి మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు అందులో భాగంగానే ప్రతి ఒక్క మహిళ కుట్టు శిక్షణతో ఉపాధి పొందాలని మహిళలకు సూచించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగరాజు గ్రామ సంఘం అధ్యక్షురాలు బాలవ్వ సిసి  భూమయ్య వివో ఏ  మహిళా సంఘాల  సభ్యులు పాల్గొన్నారు.
Spread the love