తాగునీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించాలి: ఎంపీడీవో సంతోష్ కుమార్

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు శుక్రవారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో  ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో త్రాగునీటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు త్రాగు నీటికి ఇబ్బంది కాకుండా ఉండేందుకు ముందుగా నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి  వాటి పరిష్కారాలకు మార్గం చూపాలన్నారు. గ్రామాలలోని బోరు మోటర్లు పైప్ లైన్ లు  మరమ్మత్తులు ఉంటే తక్షణమే చేయించాలన్నారు. అలాగే మిషన్ భగీరథ నీటి సరఫరా, పైప్ లైన్ లు  పనితీరుపై  పర్యవేక్షించాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు,  ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ ఓ గంగా మోహన్, ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ సందీప్, ఏపీవో నరసయ్య తదితరులున్నారు.
Spread the love