ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన ఎంపీటీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దండు మల్కాపురం ఎంపిటిసి చిట్టెంపల్లి శ్రీనివాసరావు ఆదివారం కలిసి ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. దండు మల్కాపురం గ్రామం పైనుంచి హైదరాబాదుకు నల్లగొండకు బస్సులు నడపాలని ఎమ్మెల్యేకు కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అసలైన లబ్ధిదారులకు గుర్తించి పంపిణీ చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని గ్రామంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ చిట్టెంపల్లి జంగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సుక్క కృష్ణ, ఎలువర్తి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Spread the love