నేటి నుంచి ముత్తినేని ‘విజయ సంకల్ప యాత్ర’

– ‘కరపత్రం’ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ…టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య బుధవారం నుంచి విజయసంకల్ప యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం తన నివాసంలో ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, పెరికల కులస్తుల సంక్షేమం కార్యక్రమాలను ప్రచారం చేస్తూనే…కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరనున్నట్టు ముత్తినేని తెలిపారు. ఆయా వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తెలిపారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం గాంధీభవన్‌లో ప్రచార యాత్ర వాహనాన్ని ప్రారంభిస్తారు.

Spread the love