హైదరాబాద్ : రీసైక్లింగ్ ప్లాస్టిక్ రంగంలో ఉన్న వికాస్ లైఫ్కేర్ లిమిటెడ్ తన ఆగ్రో ప్రొడక్ట్స్ డివిజన్కు భారీ ఆర్డర్ దక్కినట్లు వెల్లడించింది. ప్రీమియం, ఆర్గానిక్ రైస్ సెగ్మెంట్లలో సుమారు రూ.50 కోట్ల విలువైన బియ్యం ఆర్డర్ను పొందినట్లు పేర్కొంది. ఇందులో రూ.40 కోట్ల విలువ చేసే ప్రీమియం బియ్యం రకాలను సరఫరా చేయాల్సి ఉందని పేర్కొంది. మిగిలిన రూ.10 కోట్ల ఆర్గానిక్ బ్రీడ్స్ ఆఫ్ రైస్ కోసం ఆర్డర్ను పొందినట్లు తెలిపింది. ఏడాదికేడాదితో పోల్చితే ఆ సంస్థ 20 శాతం వృద్థిని అంచనా వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.360 కోట్ల రెవెన్యూ సాధించింది. ప్రస్తుత 2024-25లో రూ.450 కోట్ల రెవెన్యూను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సామర్థ్యాలు పెంచుకోవడం, మార్కెట్లను విస్తరించుకోవాలని నిర్దేశించుకుంది.