నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మెన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్కు ప్రమాదం తృటిలో తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన బైకును తప్పించే క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢకొీట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ…డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయమే ఆయన వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా అడ్డుగా వచ్చారు. బైక్పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో కారును డ్రైవర్ పక్కకు తిప్పగా డివైడర్ను ఢ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో ఆయనకు, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలు మినహా ఎవరికి ఏమీ కాలేదని మధుయాష్కి పేర్కొన్నారు.