కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: తలసాని

నవతెలంగాణ – సనత్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. వెస్ట్ మారేడ్ పల్లిలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో డివిజన్ ల వారీగా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా పార్లమెంట్ ఎన్నికల సనత్ నగర్ ఇన్ చార్జీగా నియమితులైన వెంకట్ రెడ్డిని పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు.

Spread the love