వనదేవతలను దర్శించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ లను శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్పక్క  దంపతులు దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వీరేశం దంపతులు సతీసమేతంగా సమ్మక్క సారలమ్మ లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూరపనేని నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ గూడూరు మహిపాల్ రెడ్డి, ఎండోమెంట్ అధికారులు మధు, జగదీష్, తాటిపాముల సర్పంచ్, సర్పంచ్ తో పాటు స్థానిక నాయకులు ఎనగంటి నరేష్, పూజార్లు సిద్ధబోయిన రానా రమేష్ తదితరులు ఉన్నారు.
Spread the love