- Advertisement -
– ఏఎంసీ చైర్మన్ మహేందర్
నవతెలంగాణ-చిన్నకోడూరు
ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వ్యయం, అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ అన్నారు. గురువారం చిన్నకోడూరులోని ఆగ్రోస్లో సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు, జనుము, జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పచ్చి రొట్ట ఎరువుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుందన్నారు. మట్టిలో సూక్ష్మ జీవాల సంఖ్య పెరిగి మట్టి ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. పర్యావరణానికి హితమైన వ్యవసాయానికి దోహదపడుతుందన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ జయంత్ కుమార్,ఏఎంసీ వైస్ చైర్మన్ రాజశేఖర్,డైరెక్టర్లు రైతులు ఉన్నారు.
- Advertisement -



