‘నవతెలంగాణ’ పేదల ఆశాజ్యోతి

– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – వీణవంక: నవతెలంగాణ దిన పత్రిక పేదల ఆశాజ్యోతి అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం నవతెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవతెలంగాణ దినపత్రిక పేదల పక్షాన పోరాటం చేసే విధంగా వార్తలు ప్రచురిస్తుందని చెప్పారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండేలా పత్రికలు ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. నిత్యం పేద ప్రజల సమస్యలపై వార్తలు ప్రచురించాలని ఆకాంక్షించారు. ఎల్లవేళలా పేదల పక్షాన వార్తలు ప్రచురించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ రిపోర్టర్లు కట్టరాజు, ఏబూసి శ్రీనివాస్, సౌడమల్ల యోహన్, బద్దుల రాజుకుమార్, డివిజన్ ఇన్ చార్జి పసునూరి రాజేష్, సీనియర్ జర్నలిస్టు పరంకుశం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love