- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ వ్యవసాయ సహకార సంఘం నూతనంగా కార్యవర్గ సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘం చైర్మన్ రేకుల గంగాచరణ్, డైరెక్టర్లు నూతనంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశాన్ని దక్కించిన రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను ప్రతి ఒక్కరికి కృషి చేస్తామని సూచించారు. అదేవిధంగా మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతామని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్ మరియు సిబ్బంది కార్యవర్గ సభ్యులు శాలువా పూలమాలతో సన్మానించారు.
- Advertisement -


