– స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ
సోఫియా (బల్గేరియా) : భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరుకుంది. మహిళల 50 కేజీల విభాగం క్వార్టర్ఫైనల్లో ఫ్రాన్స్ బాక్సర్ వసిలాపై 5-0తో గెలుపొందింది. యూరోపియన్ చాంపియన్, పారిస్ ఒలింపిక్ క్వాలిఫయర్ వసిలాపై మూడు రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిపత్యం సాధించిన నిఖత్ సెమీస్కు చేరుకుంది.