ఈనెల 27 న అవిశ్వాసంపై ఓటింగ్

నవతెలంగాణ-సూర్యాపేట: మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్టా కిషర్ ల ఫై 32 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఫై ఈనెల 27 న ఓటింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు. కాగా 27 వ తేదీన ఉదయం 11.00 లకు ఛైర్మెన్ అన్నపూర్ణపై, మధ్యాహ్నం ఒంటిగంటకు వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ పై ఓటింగ్ ను పెట్టనున్నారు. ఇందుకు గాను పాలక మండలి సభ్యులకు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ప్రత్యేక నోటీసులు జారీ చేశారు.

Spread the love