రైతుల సమ్మేళనం నిర్వహించిన నూజివీడు సీడ్స్ కంపెనీ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోనూజివీడు సీడ్స్ కంపెనీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  రైతుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు సీడ్స్ అధ్వర్యంలో రైతు సమ్మేళనం మార్కెటింగ్ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానా కాలంలో సాగుచేసే పత్తి, మొక్కజన్న,వరి పంటలపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించి అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగుచేయాలన్నారు. నూజివీడు సీడ్స్ వారి నూతన మొక్కజొన్న విత్తనాలు మొక్క జోన్నలో అధిక దిగబడినిచ్చే క్యాప్సుల్, క్రాంతిలను రైతుల అధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ రైతులు ఏఎస్ఎమ్ జైకుమార్, గాంధారి ఎంఓ భైరవ ప్రసాద్ పాల్గొన్నారు.
Spread the love