పౌష్టికాహార లోపం లేకుండా చూడాలి

నవతెలంగాణ – భిక్కనూర్
చిన్నారులకు పౌష్టికాహారం లోపం లేకుండా చూడాలని రాష్ట్రీయ బాలల స్వస్థ్ వైద్యుడు మనోజ్ అన్నారు. శనివారం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లిదండ్రులకు బరువు తక్కువ ఉన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. చిన్నారుల తల్లిదండ్రులు బలమైన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వసంత, ఆశా కార్యకర్త సంతోషి, చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Spread the love