ఆటో యూనియన్ సభ్యుల విరాళం

నవతెలంగాణ – భిక్కనూర్
ఈనెల 22వ తేదీ సోమవారం అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన శ్రీరాముని ఉత్సవాలకు మండల కేంద్రంలోని ప్యాసింజర్ ఆటో యూనియన్ సభ్యులు ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 2015 రూపాయల విరాళాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు సిద్ధిరాములు, ట్రస్టు సభ్యులు భగీరథ, రమేష్ , ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Spread the love