నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి: ఆయిల్ఫెడ్ పి అండ్ పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి

నవతెలంగాణ – అశ్వారావుపేట
సంస్థ పురోభివృద్ధికి ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి కాంట్రాక్టర్ లను ఆదేశించారు. ఆ పనులు నాణ్యత గా నిర్వహించే లా పర్యవేక్షణ పెంచాలని డివిజనల్ ఆఫీసర్ ఆకులు బాల క్రిష్ణ, అశ్వారావుపేట, అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్ లు నాగబాబు, కళ్యాణ్ గౌడ్ లకు సూచించారు. అశ్వారావుపేటలో నూతన బాయిలర్ నిర్మాణం, అప్పారావుపేటలో పరిశ్రమ విస్తరణ పనులు ప్రారంభం అయి సివిల్ వర్క్ పూర్తి చేసారు. మెకానికల్ వర్క్స్ ప్రారంభించే క్రమంలో గురువారం శ్రీకాంత్ రెడ్డి పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన వెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంకటేష్, పవన్, గోపాల క్రిష్ణ తదితరులు ఉన్నారు.
Spread the love