- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్ కుదేలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడంతో మార్కెట్కు వెళ్లిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. పది రోజుల క్రితం కిలో ఉల్లి 50 నుంచి 60 రూపాయలు ఉండగా, ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి 70 నుంచి 80 రూపాయల వరకు చేరింది. ఈ ధరల పెరుగుదల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
- Advertisement -


