సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

– ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలపై హర్షం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించడం తో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు గడ్డం జ్ఞానేశ్వర్, గంగాధర్ లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసారు. వీరి ఆదేశానుసారం సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆ సంఘం అశ్వారావుపేట మండల బాధ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు తమ కుటుంబాల  గౌరవమర్యాదలు కాపాడారు అని వారు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట తాలూకా అధ్యక్షులు వెంకన్న,కార్యవర్గం సభ్యులు పాల్గోన్నారు.
Spread the love