- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఆల్ ఇండియ బార్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో కస్లాబాద్ గ్రామానికి చెందిన పయ్యావుల శ్యామల యాదగిరిల కుమారుడు పయ్యావుల దినేష్ కుమార్ ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల ఆల్ ఇండియ బార్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన దినేష్ కుమార్ ను గ్రామస్తులు, పెద్దలు అభినందించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల వృత్తిలో రాణిస్తూ పేదలకు న్యాయ సహాయం అందజేస్తానని తెలిపారు. తనను అభినందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



