ఏవైయు సొసైటీ కాళేశ్వరం జోనల్ కార్యదర్శిగా పీక కిరణ్

నవతెలంగాణ – మల్హర్ రావు
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్  ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడు  చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ సూచన మేరకు ఏవైయు కాళేశ్వరం జోనల్ కార్యదర్శిగా పీక కిరణ్ ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్, కుమార్ యాదవ్, బండి సుడకర్ లకు కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆయన తెలిపారు.
Spread the love