నవతెలంగాణ – రామారెడ్డి
జిల్లాలో ఎప్పుడు కురియని వర్షం తో, వరద బీభత్సంతో, గ్రామాలతోపాటు, రైతులు, ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటే, ప్రభుత్వానికి సూచనలిస్తూ.. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన బి ఆర్ ఎస్ నాయకులు విపత్తుపై రాజకీయం చేయటం ఏంటని సోమవారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆపదలో రాని హరీష్ రావు ఆరు నెలలకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై మండిపడటం ఏంటని ప్రశ్నించారు. ఆపదలో ఆదుకోవలసిన ప్రతిపక్ష నేత కేసిఆర్ ఫామ్ హౌస్ లో ఉండటం ఏంటని, ఎన్నికల్లో కామారెడ్డి ప్రజల ఓట్లు కావాలి కానీ, వారి బాధలు పట్టవా అని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన తీరు మారడం లేదని, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
విపత్తుపై రాజకీయమా: నా రెడ్డి మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -



