సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత..

– గుగ్గీల్ల మార్నీంగ్ వాక్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి 
– మృతురాలి కుటుంబానికి పరామర్శ 
నవతెలంగాణ – బెజ్జంకి 
చెక్ డ్యాం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామంలో మార్నీంగ్ వాక్ కార్యక్రమంలో ప్రజలను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికురాలు బోయిని సారవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయకులు ముక్కీస రత్నాకర్ రెడ్డి,చెప్యాల శ్రీనివాస్,తిప్పరవేణి బాబు,రంగోని రాజు,రావుల నర్సయ్య,బోయిని ప్రశాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love