విజేతలకు బహుమతుల ప్రధానం

నవతెలంగాణ – ఆర్మూర్  

మండలంలోని సుర్బిర్యాల్ గ్రామములో అంబేడ్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అబ్బా దిలీప్  నిర్వహిస్తున్న  కీ.శే.అబ్బా రాజేశ్వర్ స్మారక టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించినారు .రాష్ట్ర కిషన్ మోర్ఛ  అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ఆటల పోటీలో మొదటి సెమీ ఫైనల్స్ లో కొత్తపల్లి ,వేల్పూరు తలపడగ కొత్తపల్లి గెలుపొందిది ,రెండవ సెమీ ఫైనల్స్ సర్బర్యాల ,నిజమా బాద్ తలపడగా సర్విర్యాల్ గెలుపొంది ఫైనల్స్ కు  చేరుకన్నాయి ఫైనల్స్ లో సర్బిర్యాళ్ ,కొత్తపల్లి పోటిపడగ హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో 21-15 పాయింట్లు సాధించి 6 పాయింట్లు తో సు ర్బిర్యాల జట్టు విజయం సాధించింది.  అతిథులు  కీ: శె: అబ్బా రాజేశ్వర్ గారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమములో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్  నిర్వాహకులు అబ్బా దిలీప్,రాఖేష్,కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి సంకేపల్లి గంగాధర్,నగేష్,మునిరాజ్,గడ్డి చిన్నయ్య, కే జే రాజేశ్వర్,ప్రమోద్,నిఖిల్,శివ,మధు,వినోద్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love