బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో పురోగతి

నవతెలంగాణ – హైదరాబాద్: నేరేడ్‌మెట్‌ బాలికపై 10 మంది సామూహిక లైంగికదాడి చేసిన ఘటనలో కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 10 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. కీలక సూత్రధారులైన నరేష్‌, విజయ్‌లతో పాటు ఫ్రెండ్స్ వాగ్మారే బాలాజీ(23) , జీహెచ్ఎంసీ వర్కర్​గుడ్డంకి కృష్ణ(22), టిఫిన్​సెంటర్​వర్కర్ తొంటె కిరణ్​కుమార్​(26), అమెజాన్​డెలివరీ బాయ్​ గా బొల్లెగోపు అజయ్​(23), వాటర్​క్యాన్స్​ సప్లయర్​ జేమ్స్​జేవియర్(24), మల్కాజిగిరిలో ఉండే ఇంజమూరి మధు(30), వాగ్మేరా దీపక్​(25), సబావత్​ హతియా నాయక్​(25)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాచిగూడ నుంచి బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి  నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి అమ్మాయికి తాగించి లైంగికదాడికి పాల్పడ్డారు.

Spread the love