నవతెలంగాణ – హైదరాబాద్: నేరేడ్మెట్ బాలికపై 10 మంది సామూహిక లైంగికదాడి చేసిన ఘటనలో కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు ఫ్రెండ్స్ వాగ్మారే బాలాజీ(23) , జీహెచ్ఎంసీ వర్కర్గుడ్డంకి కృష్ణ(22), టిఫిన్సెంటర్వర్కర్ తొంటె కిరణ్కుమార్(26), అమెజాన్డెలివరీ బాయ్ గా బొల్లెగోపు అజయ్(23), వాటర్క్యాన్స్ సప్లయర్ జేమ్స్జేవియర్(24), మల్కాజిగిరిలో ఉండే ఇంజమూరి మధు(30), వాగ్మేరా దీపక్(25), సబావత్ హతియా నాయక్(25)లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ నుంచి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కూల్డ్రింక్లో గంజాయి కలిపి అమ్మాయికి తాగించి లైంగికదాడికి పాల్పడ్డారు.