కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు ప్రోజిటింగ్ కాపీలు అందజేత..

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని రెడ్డి పెట్, జగదాంబ తాండ, స్కూల్ తండాలోని కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ మంగళవారం ప్రోజిటింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా కుల సంఘాల పెద్దలు ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ కు, సహకరించిన స్థానిక ఎంపీపీ దశరథ రెడ్డికి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ముదిరాజ్ సంఘానికి రూ 5 లక్షలు, ఎస్సీ మాదిగ సంఘానికి రూ 4 లక్షలు, ఎస్సీ మాల సంఘానికి రూ 4 లక్షలు, కుమ్మరి సంఘానికి రూ 3 లక్షలు, యాదవ సంఘానికి రూ 4 లక్షలు, విశ్వబ్రాహ్మణ సంఘానికి రూ 3 లక్షలు, స్కూల్ తండా ఎస్టీ కమ్యూనిటీ హాల్ కు రూ 4 లక్షలు, జగదాంబ తండా ఎస్టి కమ్యూనిటీ హాల్ కు రూ 3 లక్షల సిడిపి నిధుల నుండి ప్రోస్టింగ్ కాపీలను ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ ఆయా సంఘాల పెద్దమనుషులకు అందజేశారు. కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, సర్పంచులు రాజు నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజా గౌడ్, నాయకులు చంద్రు నాయక్, ఉప సర్పంచ్ బాలయ్య, నాగులపల్లి రాజేందర్, వడ్ల లింబాద్రి, సేవ్య నాయక్, నంద నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love