ప్రజా సంక్షేమానికే ప్రజాపాలన

నవతెలంగాణ చివ్వేంల:  ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని జడ్పీ సీఈవో సురేష్, డిఎండబ్ల్యూఓ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధి లోని ఉండ్రు గొండ గ్రామంలోని గ్రామపంచాయతీ సమీపంలో బుధవారం ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల వద్దకే అధికారులు వచ్చే విధం గా కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే ప్ర జాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు రంగారావు, సర్పంచ్ పల్లేటి శైలజ నాగయ్య , ఎస్సై మధు, ఎంపీవో గోపి,గ్రామ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు,పంచాయతీ కార్యదర్శికవిత, తహశీల్దారు టీం సభ్యులు,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు, నాయకులు రామకృష్ణ, జనార్ధన్, సైదులు, జానయ్య, వీరబ్రహ్మం, ఎల్లయ్య,  ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love