ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– నూతన గ్రామపంచాయతీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
నవ తెలంగాణ –  మల్హర్ రావు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమనీ తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలోని కల్వచర్ల  గ్రామ నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, పల్లె దవఖానను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఇప్పటికే రెండు  గ్యారంటీలు అమలు చేసినట్లుగా తెలిపారు. వంద రోజుల్లో మిగతావి అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Spread the love