ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు: ఎంపీపీ దశరథ్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరాయని శుక్రవారం ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, పింఛన్లను పెంచి వృద్ధులను, వికలాంగులను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి యాజాల సురేందర్ ను కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్యం రావు, ముకుందరావు, నారాయణరెడ్డి, రవీందర్రావు, జంగం లింగం, రాజేందర్, దండ బోయిన సంజీవ్, ఆయా గ్రామా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love