నేడు మణిపూర్‌లో పర్యటించనున్న రాహుల్

నవతెలంగాణ – మణిపూర్
మణిపూర్ లో కులాల పేరుతో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దీనితో మణిపూర్ రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు అంతా తమ తమ రాష్ట్రాలకు తరలిపోతున్నారు. అయితే, గత కొంతకాలంగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పర్యటించనున్నారు. మే నెలలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత పర్యటించనుండటం ఇదే మొదటిసారి. ఇంఫాల్, చురచందుపూర్ లలోని పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నేత తెలిపారు. దీంతో పాటు అల్లర్లు ఎక్కువగా జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తారు.

Spread the love