నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలో పలు చోట్ల ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. కూకట్పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు.