మతసామరస్యానికి ప్రతీక రంజాన్

– జమా మసిద్ లో ఇస్తార్ విందు
– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ ఆని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు. పవిత్ర రంజన్ మాసం పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలో బుధవారం జమా మసిద్ లో ముస్లిం సోదరులకు ఇస్తార్ విందును నిర్వహించడం జరిగిందన్నారు.ముస్లిం సోదరులకు  రంజాన్ మాసం పవిత్ర మాసం అన్నారు.నెలరోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,నాయకులు అశోక్ రావు,రాహుల్,ఆంజనేయులు,లింగయ్య,సది,శ్రీనివాస్.సత్యనారాయణ, ముస్లిం సోదరులు అజ్మట్ అలీ,అంకుష్ మియా,రహమాన్,మై వెళ్లి, మొగులాబ్ సబ్,రజ్జు,చోట,రాజమహ్మద్ పాల్గొన్నారు.
Spread the love