నేసనల్ వైద్యరత్న అవార్డు అందుకున్న రమేష్

– అభినందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని ధన్వాడ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు సుంకు రమేష్ ఇటీవల హైదరాబాద్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో వైద్య రత్న నేసనల్ అవార్డును బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు రమేష్ ను అభినందించి, సన్మానించారు. భవిష్యత్ మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అల్లాడి శ్రీనివాస్, చంద్రమొగిలి, మహేష్,నరేశ్ పాల్గొన్నారు.
Spread the love