రెండు నెలలు అయినా రాణి బకాయిలు

Oplus_0

నవతెలంగాణ-శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ రాజాపూర్ గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పర్యటనలో భాగంగా మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల రెండు నెలలు నుండి కూలీ డబ్బులు రావడంలేదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెంటనే పాత బకాయిలు అందించాలని అన్నారు. పని ప్రదేశాలలో వాటర్,టెంటు, మెడికల్ కిట్లు సదుపాయాలు కల్పించాలని సమ్మర్ ఆల్వేస్ ఇవ్వాలని అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా 600 రూపాయలు రోజు కూలి 200 రోజులు పని దినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో. స్వామి ప్రభాకర్. ఎల్లమ్మ. మైసయ్య,మల్లేశం, సంపత్, కార్మికులు. తదితరులు పాల్గొన్నారు.

Spread the love