మాస్‌ బీట్‌తో రాజంపేట రాణి

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి, దీపాలి రాజపుత్‌ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్‌ మాస్టర్‌ విడుదల చేసారు. సత్య కశ్యప్‌ సంగీతం అందించారు. శాంతి స్వరూప్‌ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ, ”జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్‌ అందరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినిమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే మాస్‌ బీట్‌ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని తెలిపారు.
‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాశాను. నిర్మాతల చక్కని సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శేఖర్‌ మాస్టర్‌ ఈ మాస్‌ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు శాంతికుమార్‌ చెప్పారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది అని నిర్మాత చెప్పారు.
సమీర్‌, సి.వి.ఎల్‌ నరసింహారావు, గౌతమ్‌ రాజు ఎమ్మెస్‌ చౌదరి, భద్రం, సుమన్‌ శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి మోహన్‌ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్‌, బ్యాక్‌గ్రౌండ్‌: ఎస్‌ చిన్న, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్‌, కొరియోగ్రాఫర్‌: భాను, చంద్ర కిరణ్‌, ఫైట్స్‌: నందు, బ్యానర్‌:శ్రీ భావనేశ్‌ ప్రొడక్షన్స్‌, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి.

Spread the love