నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ టీ20లకు భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్ మెంట్ ప్రకటించారు. భారత్ తాజాగా సాధించిన 2024 టీ20 ప్రపంచ కప్లో జడేజా సభ్యుడిగా ఉన్నాడు. ‘‘నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇతర ఫార్మాట్లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్ను గెలవాలనే కల నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఉన్నతమైన శిఖరం అంటూ జడేజా తన ఇన్స్టా ఖాతాలో పోస్టు చేశాడు.