2024టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌య్యాడు. ఈ మేర‌కు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు. 2007లో జ‌రిగిన మొద‌టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌రఫున ప్రాతినిధ్యం వ‌హించిన యువీ.. టైటిల్ గెలవ‌డంతో కీల‌క పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువ‌రాజ్ ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు బాదాడు. కాగా, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీ ముగిసిన రోజుల వ్య‌వ‌ధిలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ ఐసీసీ టోర్నీకి తెర లేవ‌నుంది. జూన్ 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.

Spread the love