నవతెలంగాణ – జైపుర్: ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113*; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు) శతకం బాదాడు. ఈ సీజన్లో నమోదైన మొదటి సెంచరీ ఇదే. డుప్లెసిస్ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ (1), సౌరభ్ చౌహన్ (9) నిరాశపర్చారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ ఒక వికట్ పడగొట్టారు.