అంబర్ పేటలో కబ్జాలను వీహెచ్ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సోమవారం ఆయన అంబర్‌పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అంబర్ పేటలో కబ్జాలను వీహెచ్ అడ్డుకున్నారని కితాబునిచ్చారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే తాము బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో ఓఆర్ఆర్, ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీటిని తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్సే అన్నారు.

Spread the love