వేంకటేశ్వర స్వామి అనుగ్రహము పొందాలి: రవీంద్ర కుమార్ 

– ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
– దైవ చింతనతో మానసిక ప్రశాంతత
– బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ 
నవతెలంగాణ – డిండి
దైవచింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి వేంకటేశ్వర స్వామి అనుగ్రహము పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం డిండి మండలం దాసరినేమిలిపూర్ గ్రామంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆయన వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆ వేంకటేశ్వర స్వామి ప్రజలను  మంచి ఆయు, ఆరోగ్యంతో ఉండేలా చూడాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మునికుంట్ల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహా రావు, రమావత్ రమేష్, కో-ఆప్షన్ సభ్యులు జంగిర్, నరేందర్ రెడ్డి, రాంరెడ్డి, మహేష్, బొడ్డుపల్లి కృష్ణ, రామావత్ తూలసీరాం, వడ్త్య బాలు, దూడ బావోజి, గుండాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love